ఏపీలో మరో 142 మందికి కొవిడ్ పాజిటివ్

ఏపీలో గడచిన 24 గంటల్లో 32,793 శాంపిల్స్ పరీక్షించగా, 142 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 28, తూర్పు గోదావరి జిల్లాలో 21, అనంతపురం జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు వెల్లడైంది.

అదే సమయంలో 188 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,552 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,101 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,989 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,462కి పెరిగింది.

Andhra Pradesh
COVID19
Daily Report
Today Cases

More Telugu News