ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం ఏంటి?: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
- పీఆర్సీ సహా 71 డిమాండ్ల సాధనకు ఉద్యోగుల ఉద్యమం
- నిరసనలు కొనసాగుతాయన్న ఉద్యోగ సంఘాల నేతలు
- ఇలాంటి వ్యాఖ్యలతో ఉద్యోగులకే నష్టమన్న సజ్జల
- హామీలను తప్పకుండా అమలు చేస్తామని వెల్లడి
ఇలాంటి వ్యాఖ్యలతో ఉద్యోగులకే నష్టమని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సజ్జల తెలిపారు. మరో వారంలో పీఆర్సీ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. సీపీఎస్ రద్దు అంశంపై కమిటీలు ఏర్పాటు చేశామని, నెలరోజుల్లో అధ్యయనం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు.