అరుదైన‌ సంఘ‌ట‌న‌ .. అమ‌రావ‌తి రైతులకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ రెడ్డి సంఘీభావం

sridha reddy supports amaravati farmers padayatra
షార్ట్స్‌లో చూడండి
అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర కొన‌సాగుతోంది. అమ‌రావ‌తినే ఏపీ రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని వారు డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. రైతులు నెల్లూరు మీదుగా వెళ్తూ ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు. ఈ స‌మ‌యంలో అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. రైతుల‌కు వైసీపీ నేత‌, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. రైతుల‌తో కాసేపు మాట్లాడారు.

రైతులకు ఏ అవ‌స‌రం వ‌చ్చినా త‌న‌ను సంప్ర‌దించాల‌ని, తాను స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పారు. అయితే, ఆ స‌మ‌యంలో జై అమ‌రావ‌తి అంటూ నిన‌దించాల‌ని రైతులు కోరారు. అందుకు శ్రీ‌ధ‌ర్ రెడ్డి నిరాక‌రించారు. ఆ నినాదం చేసేందుకు త‌న‌కు ఇబ్బందులు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.  

Go Back to Shorts
Kotamreddy Sridhar Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News