గోదావరిఖనిలో దారుణం.. మీ సేవ ఆపరేటర్ను నరికి చంపి, శరీర భాగాలను వేర్వేరు చోట్ల పడేసిన నిందితుడు
- శరీర భాగాలను వేరుచేసిన నిందితుడు
- పోలీసుల అదుపులో నిందితుడు
- అతడిచ్చిన సమాచారంతో శరీర భాగాల గుర్తింపు
- బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న బాధితుడి తల్లి
గురువారం సాయంత్రం నుంచి జాడ లేకపోవడంతో శుక్రవారం శంకర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంకర్ కోసం గాలించారు. ఈ క్రమంలో నిన్న ఉదయం ఎన్టీపీసీ ప్లాంటు గోడ వద్ద మొండెం నుంచి వేరైన శంకర్ తలను గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిచ్చిన వివరాలతో వేర్వేరు చోట్ల పడేసిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడిని బంధువులే హత్య చేశారన్న శంకర్ తల్లి పోచమ్మ ఫిర్యాదుతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.