రాజంపేట వరదల్లో 38 మంది గల్లంతు.. ఇంకా దొరకని 13 మంది ఆచూకీ
- వారి కోసం గాలిస్తున్నామన్న మన్నూరు ఎస్సై
- 25 మంది మృతదేహాలు దొరికాయని వెల్లడి
- అన్నమయ్య డ్యామ్ తెగడంతో ముంచెత్తిన వరద
తాజాగా ఆ వరదలకు సంబంధించి మన్నూరు ఎస్సై భక్త వత్సలం అప్ డేట్ ఇచ్చారు. రాజంపేట వరదల్లో 38 మంది గల్లంతయ్యారని, 25 మంది మృతదేహాలు దొరికాయని చెప్పారు. ఇంకా 13 మంది ఆచూకీ దొరకలేదని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. వర్షాల వల్ల రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇచ్చి ఆదుకోవాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు, ప్రతిపక్ష నేతలు పర్యటిస్తున్నారు. బాధితులకు చేదోడుగా నిలుస్తున్నారు.