నల్లగా ఉందని విడాకులిచ్చిన భర్త.. కేసు పెట్టిన భార్య!
- మార్చిలో ఆలం అనే వ్యక్తితో బాధితురాలికి వివాహం
- కట్నం కింద మూడెకరాలు ఇచ్చిన బాధితురాలి తండ్రి
- అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు
ఈ ఏడాది మార్చి 7న బాధిత మహిళకు ఆలం అనే వ్యక్తితో వివాహం జరిగింది. కట్నం కింద సుమారు మూడెకరాలు కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కావాలంటూ ఆమెను భర్త, అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. బాధితురాలి తండ్రి వద్ద మిగిలిన భూమిని కూడా అమ్మేసి రూ. 10 లక్షలు తీసుకురావాలని... దీంతో కారు కొనుక్కుంటామని ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో పలుమార్లు ఆమెపై దాడి చేశారు. ఆ తర్వాత నల్లగా ఉందని చెపుతూ భర్త తలాక్ చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసినట్టు ఇన్స్ పెక్టర్ రాజీవ్ సింగ్ తెలిపారు.