లఖింపూర్ ఖేరి ఘటనలో మరో ట్విస్ట్.. మంత్రి కుమారుడి తుపాకీ నుంచి కాల్పులు వాస్తవమేనంటున్న ఫోరెన్సిక్ రిపోర్ట్!
- ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడి
- ఆశిష్ మిశ్రా, అనుచరుడి తుపాకుల నుంచి కాల్పులు
- ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఆశిష్
అయితే, ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా, ఆయన అనుచరులు కాల్పులు జరిపారని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆశిష్, అంకిత్ ల లైసెన్స్డ్ గన్నులను అక్టోబర్ 15న ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించారు. వాటిని పరీక్షించిన ఫోరెన్సిక్ లేబొరేటరీ.. ఆ తుపాకుల నుంచి కాల్పులు జరిగినట్టు ధ్రువీకరించింది. కాగా, లఖింపూర్ కేసుకు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.