టీడీపీ కార్యాలయం, పట్టాభి నివాసంపై దాడులకు పాల్పడిన నిందితుల అరెస్ట్
- మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి
- విజయవాడలో పట్టాభి నివాసం ధ్వంసం
- టీడీపీ ఆఫీసు దాడి ఘటనలో 10 మంది అరెస్ట్
- పట్టాభి ఇంటిపై దాడి ఘటనలో 11 మంది అరెస్ట్
మంగళగిరి ఎన్టీఆర్ భవన్ కు పోలీసుల నోటీసులు
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయ ఉద్యోగి బద్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజి ఇవ్వాలంటూ పోలీసులు ఎన్టీఆర్ భవన్ సిబ్బందిని కోరారు. సాయంత్రం 5 గంటల్లోపు ఫుటేజి వివరాలు సమర్పించాలని సూచించారు. ఈ మేరకు రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమారస్వామికి నోటీసులు అందజేశారు.