Andhra Pradesh: ఏపీలో కొత్తగా 523 కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

AP registers 523 Corona new cases in last 24 hours
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురి మృతి
  • ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 5,566
ఏపీలో గత 24 గంటల్లో 44,086 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 523 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 2 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మహమ్మారి వల్ల మృతి చెందారు. ఇదే సమయంలో 608 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,61,810కి పెరిగింది. మొత్తం 20,41,924 మంది కోలుకున్నారు. 14,320 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,566 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News