కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వచ్చిన సిబ్బంది... పాముతో కరిపిస్తానంటూ మహిళ బెదిరింపు
- దేశంలో కరోనా వ్యాక్సినేషన్
- రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఘటన
- వ్యాక్సిన్ తీసుకునేందుకు మొండికేసిన మహిళ
- బుట్టలో ఉన్న పామును బయటికి తీసిన వైనం
అజ్మీర్ లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న సిబ్బంది ఓ మహిళను టీకా తీసుకోవాలని కోరారు. అయితే ఆ మహిళ అందుకు నిరాకరిస్తూ, తనకు బలవంతంగా వ్యాక్సిన్ వేయాలని చూస్తే పాముతో కరిపిస్తానంటూ హెచ్చరించింది. అంతేకాదు, బుట్టలో ఉన్న పామును బయటికి తీసింది. దాంతో ఆరోగ్య సిబ్బంది మొదట భయపడినా, ఆ తర్వాత ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి మనసు మార్చారు. ఆమె ఒప్పుకోవడంతో అక్కడున్న వారందరికీ వ్యాక్సిన్లు వేశారు.