దసరా తిరుగు ప్రయాణాలు ఆరంభం.. హైదరాబాద్కు 150 బస్సులు రెడీ చేసిన ఏపీఎస్ ఆర్టీసీ
- రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని బస్సులు
- రేపటి నుంచి అంతర్ జిల్లా బస్సులు అందుబాటులోకి
- ప్రత్యేక బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ షురూ
ఒకటి, రెండు జిల్లాల మధ్య ప్రయాణించేవారితో రేపు తెల్లవారుజాము నుంచి రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రేపు ఉదయం నుంచి అంతర్ జిల్లా సర్వీసులను కూడా అదనంగా నడపాలని నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైన చోట్ల అదనపు బస్సులు నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.