Manchu Vishnu: పోలింగ్ సమయం పెంచారు... ఓటు వేయని వారు సద్వినియోగం చేసుకోండి: మంచు విష్ణు

Manchu Vishnu says polling time extended
షార్ట్స్‌లో చూడండి
మా ఎన్నికల పోలింగ్ కు అదనపు సమయం కేటాయించినట్టు మంచు విష్ణు వెల్లడించారు. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగియాల్సి అయింది. అయితే కొన్ని కారణాలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఓటింగ్ కు సకాలంలో రాలేకపోయిన వారి కోసం పోలింగ్ అధికారి కొంత అదనపు సమయం ఇచ్చినట్టు విష్ణు తెలిపారు.

ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ జామ్ కారణంగా కొందరు రాలేకపోయినట్టు తెలిసిందని, అలాంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా వచ్చి తమ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటు విలువైనదేనని మంచు విష్ణు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Manchu Vishnu
MAA Elections
Polling
Grace Time
Tollywood

More Telugu News