కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయిన రాజస్థాన్
- షార్జాలో రాజస్థాన్ వర్సెస్ ముంబయి
- మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
- నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 90 రన్స్
- 24 పరుగులు చేసిన ఓపెనర్ ఎవిన్ లూయిస్
- నిరాశపరిచిన శాంసన్, దూబే
ఆ జట్టులో అత్యధికంగా ఎవిన్ లూయిస్ 24 పరుగులు చేశాడు. జైశ్వాల్ 12, కెప్టెన్ సంజు శాంసన్ 3, శివం దూబే 3, గ్లెన్ ఫిలిప్స్ 4, డేవిడ్ మిల్ల్ 15, రాహుల్ తెవాటియా 12 పరుగులు చేశారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జిమ్మీ నీషామ్ కూడా ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి జట్టు 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 22 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మకు జతగా ఇషాన్ కిషన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.