బీ కేర్ ఫుల్.. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉంది: ఐసీఎంఆర్
- ఎనిమిది రాష్ట్రాలకు ఐసీఎంఆర్ హెచ్చరిక
- రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఐసీఎంఆర్
- పిల్లలకు, టీకాలు వేయించుకోని వారికి ప్రమాదం ఉండే అవకాశం
మరోవైపు వైద్య నిపుణులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టీకాలు వేయించుకోని వ్యక్తులు, పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని చెపుతున్నారు. ఈ సందర్భంగా, ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ మాట్లాడుతూ, థర్డ్ వేవ్ రావడం, రాకపోవడం ప్రజలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందరికీ వ్యాక్సిన్ వేయడంతో పాటు, కోవిడ్ ప్రొటోకాల్ ను కరెక్ట్ గా పాటిస్తే థర్డ్ వేవ్ ను ఆపొచ్చని తెలిపారు.