ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో స్కామ్ జరిగింది: ఏసీబీ

ACB finds scam in AP CMRF check distribution
  • రూ. 117 కోట్లు పక్కదారి పట్టినట్టు ఏసీబీ గుర్తింపు
  • పలువురిపై ఇప్పటికే కేసుల నమోదు
  • సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు కూడా ఏసీబీ గుర్తింపు
ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీలో కుంభకోణం జరిగిందని ఏసీబీ తేల్చింది. ఈ స్కామ్ లో సచివాలయంలోని కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. చెక్కుల పంపిణీలో రూ. 117 కోట్లను పక్కదారి పట్టించేందుకు యత్నించారని గతంలోనే ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి గత సెప్టెంబర్ లోనే కేసు నమోదైంది.

ఈ స్కామ్ లో ప్రజాప్రతినిధుల పీఏలు, వారి అనుచరుల ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో దాదాపు 50 మంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేశారు. అంతేకాదు ఏపీ సచివాలయంలో కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు కూడా ఏసీబీ గుర్తించింది.
Go Back to Shorts
Andhra Pradesh
ACB
CMRF
Check Scam

More Telugu News