సాయితేజ్ కు వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోంది: అపోలో వైద్యులు

  • సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్
  • సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
  • ఇంకా ఐసీయూలోనే చికిత్స
  • నిన్న సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్స
సినీ హీరో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాదు అపోలో ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్ విడుదల చేశాయి. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు ఆ బులెటిన్ లో వెల్లడించారు. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సాయితేజ్ కు వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని వివరించారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయితేజ్ ఓ స్పోర్ట్స్ బైకు నుంచి పడి తీవ్రగాయాలపాలవడం తెలిసిందే. సాయితేజ్ కాలర్ బోన్ విరిగినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. నిన్న అపోలో వైద్యులు సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

Saitej
Health Bulletin
Apollo Hospitals
Hyderabad
Road Accident

More Telugu News