టీమిండియా మెంటార్ గా ధోనీ నియామకంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన అజయ్ జడేజా
- వచ్చే నెలలో యూఏఈలో టీ20 వరల్డ్ కప్
- టీమిండియా మెంటార్ గా ధోనీ
- బీసీసీఐ నిర్ణయంపై మాజీల విమర్శలు
- జట్టుకు మెంటార్ అవసరంలేదన్న జడేజా
కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా మెరుగైన ఫలితాలు సాధిస్తోందని, జట్టుకు మెంటార్ అవసరంలేదని అజయ్ జడేజా స్పష్టం చేశారు. జట్టుకు ఓ కోచ్ ఉన్నాడు. అతడు జట్టును వరల్డ్ నెంబర్ వన్ గా తీర్చిదిద్దాడు. ఇలాంటప్పుడు రాత్రికిరాత్రే మెంటార్ ను నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు.