అనంతపురంలో విషాదం.. గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మరణించిన యువకుడు!

Young Boy died while dancing at Ganesh mandapam in Guthi anantapur dist
షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తున్న ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. గణేశ్ నవరాత్రులను పురస్కరించుకుని గుత్తిలోని స్థానిక గౌతమిపురి కాలనీలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఓ యువకుడు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోనే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు.
Go Back to Shorts
Anantapur District
Guthi
Vinayaka Chavithi

More Telugu News