Telangana: తెలంగాణలో కొత్తగా 322 మందికి కరోనా

Telangana covid update
  • గత 24 గంటల్లో 71,402 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 76 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 5,852 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,402 కరోనా పరీక్షలు నిర్వహించగా, 322 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 76 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 27, వరంగల్ అర్బన్ జిల్లాలో 25, రంగారెడ్డి జిల్లాలో 22, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 331 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,58,376 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,48,648 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,852 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,876కి పెరిగింది.
Telangana
Corona Virus
New Cases
Deaths

More Telugu News