Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,321 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

19 dead in AP due to Corona
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా కేసులు ఈరోజు కొంత తగ్గాయి. గత 24 గంటల్లో 64,461 మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,321 మందికి కరోనా నిర్థారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 225 కేసులు, అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది మృతి చెందగా... 1,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,10,566 కేసులు నమోదు కాగా... 19,81,906 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,807 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News