దేశంలో మరో 44,658 కరోనా పాజిటివ్ కేసులు

India wide corona cases update
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 496 మంది కరోనాతో మృతి చెందారు. 32,988 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,03,188కి చేరింది. 3,18,21,428 మంది కోలుకోగా, ఇంకా 3,44,899 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,36,861కి పెరిగింది.

కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే అధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. కేరళలో తాజాగా 30,007 పాజిటివ్ కేసులు, 162 మరణాలు నమోదైనట్టు తెలిపింది.
Go Back to Shorts
India
Corona Virus
Positive Cases
Deaths
Kerala

More Telugu News