11 ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్న తెలంగాణ మహిళ తమిళనాడులో ప్రత్యక్షం
- 11 ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన మహిళ
- ఆ తర్వాత రెండేళ్లకు అంత్యక్రియలు
- మతిస్థిమితం కోల్పోయి తమిళనాడు చేరుకున్న మహిళ
- చేరదీసి చికిత్స అందించిన స్వచ్ఛంద సంస్థ
ఆ తర్వాత రెండేళ్లకు కమ్మర్పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దుస్తులను బట్టి ఆమె లక్ష్మియేనని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తిచేసేశారు. మరోవైపు, మతిస్థిమితం కోల్పోయిన లక్ష్మి ఇంటి నుంచి బయలుదేరి తిరుగుతూ తిరుగుతూ తమిళనాడులోని పెరంబలూరు చేరుకుంది. అక్కడ ఆమెను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి చికిత్స చేయించింది.
కొన్నాళ్లకు చికిత్సతో కోలుకున్న లక్ష్మి నుంచి వివరాలు సేకరించిన స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తమిళనాడు చేరుకున్న కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయిందనుకున్న లక్ష్మి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.