ఆఫ్ఘన్ సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ సుదీర్ఘ చర్చ
- ఆఫ్ఘన్ లో మళ్లీ తాలిబన్ల పాలన
- ఆందోళనలో ప్రపంచ దేశాలు
- పరిష్కారం కోసం పుతిన్ తో మోదీ చర్చ
- 45 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ
"ఆఫ్ఘనిస్థాన్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై నా మిత్రుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఎంతో ఉపయుక్తమైన, వివరణాత్మక సంభాషణ జరిపాను. అంతేకాకుండా భారత్-రష్యా ద్వైపాక్షిక అంశాలపైనా మాట్లాడుకున్నాం. కొవిడ్-19కు వ్యతిరేకంగా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడంపైనా చర్చించాం. కీలక అంశాలపై ఇకపైనా దేశాధినేతల స్థాయిలో చర్చలు జరపడం కొనసాగించాలని తీర్మానించాం" అని వివరణ ఇచ్చారు.