వెలిగొండ పనులు నిలుపుదల చేయాలని కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు లేఖ
- కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ లేఖ
- ఏపీ ప్రాజెక్టులపై మరోసారి అభ్యంతరాలు
- వెలిగొండ ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తోందని ఆరోపణ
- బచావత్ ట్రైబ్యునల్ ప్రస్తావన
కాగా ఈ నెల 27న కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రావాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు బోర్డు సమాచారం అందించింది. ఈ భేటీలో 14 అంశాలు చర్చించాలని అజెండా నిర్ణయించారు. కానీ, అదే రోజున నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విచారణ ఉండడంతో తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ సమావేశానికి హాజరయ్యేది సందేహంగా మారింది.