'రక్షా బంధన్' శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్
- ఆదివారం రాఖీ పౌర్ణమి
- సహోదరత్వానికి ప్రతీకగా అభివర్ణించిన కేసీఆర్
- భారతీయ ఔన్నత్యానికి నిదర్శనమని వెల్లడి
- తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్ష
'రక్షాబంధన్' ను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, సహోదరత్వానికి ఈ పండుగ నిదర్శనంలా నిలుస్తుందని అభివర్ణించారు. ఇదొక గొప్ప సందర్భమని, జీవితకాలం పాటు తమ అనుబంధం కొనసాగాలని కోరుకుంటూ అన్నదమ్ముల చేతికి మమతానురాగాలతో రక్షా బంధనాన్ని కడతారని రాఖీ పండుగ ప్రాశస్త్యాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. భారత ప్రజల జీవన ఔన్నత్యం ఈ పండుగ ద్వారా వెల్లడవుతుందని తెలిపారు.