టోక్యో పారా ఒలింపిక్స్ లో కరోనా కలకలం
- ఇటీవలే విజయవంతంగా ముగిసిన ఒలింపిక్స్
- ఈ నెల 24న ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్
- పారా ఒలింపిక్ విలేజ్ లో తొలి పాజిటివ్ కేసు నమోదు
ఇప్పుడు టోక్యో పారా ఒలింపిక్స్ కు సర్వం సిద్ధమైంది. ఈనెల 24న పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 5న ఈ క్రీడలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు ఇప్పటికే అక్కడకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో పారా ఒలింపిక్ గ్రామంలో ఒక కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపింది.