కాబూల్లో చిక్కుకుపోయిన మంచిర్యాల వాసి.. కుటుంబం ఆందోళన
- 8 సంవత్సరాలుగా కాబూల్లో పనిచేస్తున్న రాజన్న
- నేడు స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు
- విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆందోళన
- సురక్షితంగా దేశం దాటించాలంటూ వేడుకోలు
రాజన్నతోపాటు కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన వెంకన్న కూడా అక్కడే ఉన్నాడు. ఈ నెల 18న (నేడు) వీరిని ఇండియా పంపేందుకు సంస్థ టికెట్లు కూడా బుక్ చేసింది. అయితే, కాబూల్ నుంచి వాణిజ్య విమానాల సేవలు నిలిచిపోవడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా దేశం నుంచి తరలించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరోవైపు, రాజన్న కుటుంబం కూడా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆయనను సురక్షితంగా స్వగ్రామం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది.