తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు!
- రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
- రాష్ట్రంలో పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు
- బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి
నిన్న రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిశాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోయాయి. సాధారణం కంటే 7 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. మహబూబ్నగర్లో పగటి ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. ఇక కుమురంభీం జిల్లా వెంకట్రావుపేటలో అత్యధికంగా 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.