నాగర్ కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు

Earthquake in Nagarkurnool District
  • పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి
  • ప్రకంపనలతో ఉలిక్కి పడిన ప్రజలు
  • వర్షాల కారణంగా భూమి పొరల్లోకి నీరు చేరుకోవడం వల్ల ప్రకంపనలు
ఈ తెల్లవారుజామున తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్, అచ్చంపేట, ఉప్పునుంతలలో భూప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. మరోవైపు భూప్రకంపనలతో ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. భయభ్రాంతులతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పొరల్లోకి నీరు చేరుకోవడం వల్ల భూప్రకంపనలు వచ్చి ఉండొచ్చని నిపుణులు చెపుతున్నారు.
Go Back to Shorts
Telangana
Eartquake
Nagarkurnool District

More Telugu News