కోర్టు ధిక్కార కేసులో మరో ఐఏఎస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు
- ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణను అరెస్ట్ చేయాలని ఆదేశం
- రూ. 50 వేల జరిమానా విధింపు
- జైలు శిక్షను నిలిపివేయాలని కోర్టును కోరిన సత్యనారాయణ
కోర్టు ధిక్కారం నేపథ్యంలో రూ. 50 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హైకోర్టు తెలిపింది. రూ. 50 వేల జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని సూచించింది. అయితే జైలు శిక్షను నిలిపివేయాలని సత్యనారాయణ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో, ఈ విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.