'విరాటపర్వం' విడుదలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
- రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం'
- కథానాయికగా సాయిపల్లవి
- మావోయిస్టుల పోరాటమే నేపథ్యం
- థియేటర్లలోనే విడుదల
తాజాగా ఈ విషయంపై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుందని అన్నాడు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే పట్టుదలతోనే నిర్మాతలు ఉన్నారనీ, థియేటర్లు ఓపెన్ అయిన తరువాత, పరిస్థితులు చూసుకుని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పాడు. 'అరణ్య' తరువాత రానా నుంచి వస్తున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.