ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టవద్దు: ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన కేఆర్ఎంబీ
- జలవివాదాలపై దృష్టి సారించిన కేఆర్ఎంబీ
- బోర్డుకు డీపీఆర్ సమర్పించకుండా పనులు చేపట్టవద్దని ఆదేశం
- తెలంగాణ ఈఎన్సీకి కూడా లేఖ
- ఏపీ ఫిర్యాదులపై స్పందించాలని స్పష్టీకరణ
హరికేశ్ మీనా అటు తెలంగాణ ఈఎన్సీకి కూడా లేఖ రాశారు. చిన్న నీటివనరులకు తెలంగాణ అధిక నీరు తీసుకుంటోందని ఏపీ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తెలంగాణకు 89.15 టీఎంసీలు కేటాయిస్తే 175.54 టీఎంసీలు తీసుకుందని ఆరోపించినట్టు వివరించారు. ప్రాజెక్టుల నుంచి కృష్ణా జలాలను తరలించకుండా చూడాలని ఏపీ కోరిందని తెలిపారు. ఏపీ ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని మీనా తెలంగాణను కోరారు.
కాగా, కేఆర్ఎంబీ మరో సభ్యుడు మౌంతాంగ్ ఇవాళ తెలంగాణ జెన్ కో డైరెక్టర్ కు లేఖ రాయడం తెలిసిందే. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల నుంచి జలవిద్యుదుత్పత్తి చేపట్టరాదని తెలంగాణను ఆదేశించారు.