ఆర్డీఎస్ పనులు అడ్డుకోవాలంటూ కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ
- ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం పునర్విభజన చట్టానికి వ్యతిరేకం
- కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండానే నిర్మాణం
- నిర్మాణ పనుల ఫొటోలను లేఖకు జత చేసిన తెలంగాణ
కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 నిర్ణయాన్ని కేంద్రం ఇంకా నోటిఫై చేయలేదని, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాకపోయినా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టిందని ఆ లేఖలో ఆరోపించారు. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణ పనులు జరుగుతున్న ఫొటోలను ఈ లేఖకు జతచేశారు. దీనివల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, కాబట్టి వెంటనే పనులను నిలిపివేయాలని కోరారు.