అరంగేట్రంలో అదరగొట్టిన దొడ్ల డెయిరీ... ఒడిదుడుకుల్లో కిమ్స్!
- ఇటీవల ఐపీఓకు వచ్చిన రెండు సంస్థలు
- 20 శాతం వరకూ లాభాన్నిచ్చిన దొడ్ల డెయిరీ
- లాభం నుంచి నష్టాల్లోకి జారిన కిమ్స్
ఇక కిమ్స్ ఈక్విటీ విషయానికి వస్తే, రూ. 1,008 ఈక్విటీ ధర కాగా, ఆదిలో లాభాలు అందించి, రూ.1,057 వరకూ వెళ్లిన ధర, ఇప్పుడు రూ. 970 వద్ద కదలాడుతోంది.
ఈ ఉదయం 10.30 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే 18 పాయింట్లు నష్టపోయి, 52,914 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెషన్ ఆరంభంలో 53వేల మార్క్ ను సూచిక తాకగా, ఆ తరువాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో మార్కెట్ కిందకు జారింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక ఎన్ఎస్ఈ, దాదాపు స్థిరంగా ఉంది.