రేపటి నుంచి తాజ్ మహల్ సందర్శనకు అనుమతి
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు ఆంక్షలు
- తగ్గిన కరోనా ఉద్ధృతి
- ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్
- విడతకు 650 మందికి అనుమతి
అయితే తాజ్ మహల్ చూడాలనుకునేవారు ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫోన్ ద్వారా గరిష్ఠంగా 5 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. తాజ్ మహల్ సందర్శనకు విడతకు 650 మందిని అనుమతించనున్నారు.
తాజ్ మహల్ లోపల సందర్శకులు గుమికూడకుండా ప్రత్యేక సిబ్బందితో పర్యవేక్షణ ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు ఓ స్పాంజిపై నడిస్తే వారి పాదరక్షలు శానిటైజ్ అయ్యే విధంగా ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. అటు, ఆగ్రాకు సమీపంలోని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 228 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి.