Telangana: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై జీవో జారీ

Govt order issued on Inter second year exams cancellation

  • తెలంగాణలో ఇంటర్ పరీక్షల రద్దు
  • మార్కుల కేటాయింపు అధికారం ఇంటర్ బోర్డుకు
  • విధివిధానాలను ప్రభుత్వానికి సమర్పించనున్న బోర్డు
  • ప్రభుత్వ ఆమోదం వస్తే ఫలితాల వెల్లడి

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, పరీక్షల రద్దుపై నేడు జీవో జారీ చేశారు. అటు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, ఫలితాలను ఏ ప్రాతిపదికన కేటాయించాలనే విషయంలో ఇంటర్ బోర్డుకు అధికారాలు మంజూరు చేశారు. దీనిపై కసరత్తులు చేసిన ఇంటర్ బోర్డు, రేపు ఇంటర్ ఫలితాల విధివిధానాలను ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపాక రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తారు.

Telangana
Inter Exams
Second Year
Corona Pandemic
Second Wave
  • Loading...

More Telugu News