జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభం.. పాల్గొన్న హరీశ్ రావు
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ
- కొవిడ్, బ్లాక్ ఫంగస్ మందులు, పరికరాలపై పన్నులు తగ్గించే చాన్స్
- ఇప్పటికే నివేదిక అందించిన మంత్రుల బృందం
తెలంగాణ నుంచి ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్ హాజరయ్యారు. కొవిడ్, బ్లాక్ ఫంగస్ మందులు, పరికరాలపై పన్నుల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న నేపథ్యంలో వాటిపై జీఎస్టీని భారీగా తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సమావేశంలోనూ ఈ విషయమై చర్చించినప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దానిపై అధ్యయనం చేయడానికి నియమించిన మంత్రుల బృందం ఇప్పటికే తమ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖకు అందజేసింది.