ఏపీలో 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు
- మరో రెండు గంటలు మినహాయింపులు
- ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు సడలింపులు
- కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో నిర్ణయం
అధికారులు అందజేసిన నివేదికలను పరిశీలించిన ఆయన.. 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే, కర్ఫ్యూలో మినహాయింపుల వ్యవధిని పెంచారు. మరో రెండు గంటలు అదనపు సమయాన్ని కేటాయించారు. ఇప్పటిదాకా ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ పనుల కోసం అనుమతులిస్తున్నా.. ఇప్పుడు దానిని రెండింటి వరకు పెంచారు. జూన్ 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.