జడ్జి రామకృష్ణకు మెరుగైన చికిత్స అందించాలి: గవర్నర్ కు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు
- పీలేరు సబ్ జైల్లో ఉన్న జడ్జి రామకృష్ణ
- జడ్జి మధుమేహంతో బాధపడుతున్నారన్న రఘురామ
- తిరుపతి ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి
- గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి
జడ్జి రామకృష్ణను భద్రతా కారణాల రీత్యా చిత్తూరు జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించడం తెలిసిందే. తన తండ్రికి చిత్తూరు జైలులో ప్రాణహాని పొంచి ఉందని జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ తరలింపు జరిగింది.