క్రిస్ గేల్ రికార్డును మన కెప్టెన్ బాదుడు రెడ్డి బద్దలు కొట్టారు: సీఎం జగన్ పై లోకేశ్ వ్యంగ్యం
- రూ.100 దాటిన లీటర్ పెట్రోల్ ధర
- ఏపీ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్
- నాడు ట్యాక్సులు తగ్గించుకోమన్నారని వెల్లడి
- విపక్షనేతగా జగన్ ఫేక్ కబుర్లు చెప్పారని విమర్శలు
ట్యాక్సులు తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ తక్కువ ధరలకే ఇవ్వొచ్చని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ బాదుడు రెడ్డి ఫేక్ కబుర్లు చెప్పారని ఆరోపించారు. కానీ అధికారం చేపట్టాక మామూలు ట్యాక్స్ లను రెండింతలు చేసి, దానికి జే ట్యాక్స్ కూడా కలిపి మరీ పెట్రోల్ ధరను సెంచరీ దాటించారని వెల్లడించారు. ఈ మేరకు గతంలో విపక్షనేతగా జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.