నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది జలసమాధి
- ప్రమాద సమయంలో 160 మందికిపైగా ప్రయాణికులు
- గల్లంతైన 83 మందీ చనిపోయి ఉంటారని అనుమానం
- నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. 60 మృతదేహాలను వెలికితీశారు. కొందరిని రక్షించగలిగారు. గల్లంతైన మరో 83 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పడవ శిథిలావస్థకు చేరుకోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.