ఎన్నికలు ఉంటే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తాను చేయాల్సిన పనులు గుర్తుకు రావు: విజయశాంతి
- టీఆర్ఎస్ ప్రభుత్వంపై విజయశాంతి విమర్శలు
- ఇప్పటికీ రుణమాఫీ పూర్తికాలేదని వ్యాఖ్యలు
- ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
- రేపు రైతు గోస చేపట్టాలని నిర్ణయం
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనితీరాలని స్పష్టం చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను వేధించవద్దని తెలిపారు. తెలంగాణ రైతు కష్టాలు వెంటనే పరిష్కారం కావాలన్న ఆకాంక్షతో రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 'తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్ష' చేపట్టాలని నిర్ణయించినట్టు విజయశాంతి వెల్లడించారు.