టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి క్యాన్సర్ తో కన్నుమూత
- భువనేశ్వర్ కుమార్ కుటుంబంలో విషాదం
- నేడు తుదిశ్వాస విడిచిన కిరణ్ పాల్ సింగ్
- ఏడాదిగా క్యాన్సర్ తో బాధపడుతున్న వైనం
- చికిత్స పొందుతూ మృతి
గతేడాది సెప్టెంబరులో ఆయన కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. బ్రిటన్ లో వైద్య నిపుణులను సంప్రదించిన అనంతరం, ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కిరణ్ పాల్ సింగ్ కు భార్య ఇంద్రేష్ దేవి, కుమారుడు భువనేశ్వర్, కుమార్తె రేఖ ఉన్నారు.
కాగా, భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్నాడు. భువీని ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. కాగా, తండ్రిని కోల్పోయిన భువీకి టీమిండియా సహచరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.