కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ బ్లాక్ ఫంగస్ రోగులకు కూడా చికిత్స అందించాలి: సోము వీర్రాజు
- ఏపీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు
- ఔషధాల కొరత ఉందన్న సోము వీర్రాజు
- అందుకే హైదరాబాదు వెళుతున్నారని వెల్లడి
- ఏపీ రోగులను తిప్పిపంపుతున్నారని ఆరోపణ
- సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడాలంటూ లేఖ
దీనిపై ఏపీ సీఎం జగన్ చర్యలు తీసుకోవాలంటూ సోము వీర్రాజు లేఖ రాశారు. కోఠి ఆసుపత్రిలోని బ్లాక్ ఫంగస్ వార్డులో ఏపీ రోగులకు కూడా చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. తన లేఖ పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్టు సోము పేర్కొన్నారు.