ప్రధాని అసమర్థత వల్ల వేలమంది చనిపోతున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
- భారత్ లో నిత్యం లక్షల్లో కరోనా కేసులు
- వేల మంది మృత్యువాత
- ప్రధాని బాధ్యతల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యలు
- అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్
- వీడియో కాన్ఫరెన్స్ లతో లాభంలేదన్న ఒవైసీ
రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఆర్టికల్ 263 ప్రకారం ప్రధాని మోదీ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. తద్వారా రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయానికి కృషి చేయాలని సూచించారు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.