మలయాళ బ్యూటీ మళ్లీ బిజీ కానుందా?

  • పలు సినిమాలలో నటించిన మమతా మోహన్ దాస్ 
  • సింగర్ గాను మంచి మార్కులు కొట్టేసింది
  • మలయాళ సినిమాలతో బిజీ
  • తెలుగు నుంచి కూడా వెళుతున్న అవకాశాలు  
మమతా మోహన్ దాస్ పేరు వినగానే 'యమదొంగ' సినిమాలో ఆమె పోషించిన ధనలక్ష్మి పాత్ర గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో తాకట్టు వ్యాపారం చేస్తూ హీరోను రెచ్చగొట్టే పాత్రలో ఆమె ఆకట్టుకుంది. ఆ తరువాత వెంకటేశ్ సరసన 'చింతకాయల రవి' .. నాగార్జున జోడీగా 'కింగ్' .. 'కేడీ' సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి. మమతా మోహన్ దాస్ మంచి సింగర్ కూడా. తెలుగులో ఆమె పాడిన 'రాఖీ .. రాఖీ' .. 'ఆకలేస్తే అన్నం పెడతా' వంటి పాటలు జనంలోకి బాగా వెళ్లాయి.

ఆ తర్వాత దురదృష్టవశాత్తు మమతా మోహన్ దాస్ కేన్సర్ బారిన పడింది. ఆ తరువాత మనోధైర్యంతో ఆమె ఆ వ్యాధిని జయించింది. అప్పటి నుంచి ఆమె వరుసగా మలయాళ సినిమాలతో బిజీ అయింది. తాజాగా మలయాళంలో ఆమె 'లాల్ భాగ్' అనే సినిమా చేసింది. మలయాళంతో పాటు తమిళ .. తెలుగు భాషల్లోను ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి కూడా మమతా మోహన్ దాస్ కి అవకాశాలు వెళుతున్నాయట. కీలకమైన పాత్రలకి గాను కొన్ని తెలుగు ప్రాజెక్టులపై ఆమె సైన్ చేయనుందని అంటున్నారు. తెలుగులో మమతా మోహన్ దాస్ మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.


More Telugu News

Mamatha Mohan Das