సబ్బం హరి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: నారా లోకేశ్
- కరోనాకు బలైన సబ్బం హరి
- టీడీపీ వర్గాల్లో విషాదం
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్
- నిస్వార్థ రాజకీయ నేత అని కితాబు
- తమకు మార్గదర్శి అని వెల్లడి
ఏ అంశంపై అయినా సబ్బం హరి తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారని, ప్రజాసమస్యలపై రాజీ లేని పోరాటం చేశారని లోకేశ్ కీర్తించారు. సబ్బం హరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని స్పందించారు.