పీకే ది బెస్ట్... అక్కడ మమతా, ఇక్కడ స్టాలిన్: ప్రశాంత్ కిశోర్ వ్యూహాలపై సోమిరెడ్డి స్పందన
- పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ప్రభంజనం
- తమిళనాట విజయం ఖాయం చేసుకున్న డీఎంకే
- రెండు పార్టీలకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్
- పీకే వ్యూహాలే పైచేయి సాధించాయన్న సోమిరెడ్డి
బెంగాల్, తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ టీమ్ లే గెలిచాయని వెల్లడించారు. మమతా బెనర్జీని బీజేపీ ఎంత టార్గెట్ చేసినా పీకే ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదని విశ్లేషించారు. దేశంలోనే వీరనారిగా ఆమె గెలిచారని కితాబిచ్చారు. తమిళనాడులోనూ పీకే వ్యూహాలే పైచేయి సాధించాయని, స్టాలిన్ ను సీఎంగా చేస్తున్నాయని వివరించారు. మొత్తంగా పీకే వ్యూహాలే విజేతలయ్యాయని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.