నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. సాయంత్రానికి పూర్తి ఫలితాలు!
- తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం
- మరో రెండుమూడు గంటల్లో తెలిసిపోనున్న ఓటర్ల సరళి
- ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తిరుపతి ఉప ఎన్నిక సరళి మరో రెండుమూడు గంటల్లో తెలిసిపోనుంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎం. గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ సహా మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో 41 మంది ఉన్నారు.