థానేలో విషాదం: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృత్యువాత
- 3.40 గంటల ప్రాంతంలో మంటలు
- ఆసుపత్రి నుంచి 20 మందికిపైగా రోగుల తరలింపు
- ఆసుపత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించిన మంత్రి
సమాచారం తెలిసిన వెంటనే ముంబ్రా-కల్వా ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర అవహద్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తెల్లవారుజామున 3.40 గంటలకు మంటలు చెలరేగాయని థానే మునిసిపల్ కార్పొరేషన్ పేర్కొంది. రెండు పైరింజన్లతో మంటలు అదుపు చేస్తున్నామని, సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించింది.